Monday, September 20, 2010

నిధులు పెంచాలని కోరుతు గవర్నర్ కు పోస్టుకార్డులు రాసిన ఒయూ విద్యార్థులు

రాష్టంలో ఉన్న యూనివర్శిటీలకు నిధులు కేటాయించాలని కోరుతూ అఖిల భారతీయ విద్యార్థి సమాఖ్య కార్యకర్తలు ఉస్మానియ యూనివర్శిటిలో పోస్టుకార్డు ఉద్యమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్ధిని, విద్యార్థులు పాల్గోని రాష్ట గవర్నర్ కు ఉత్తరాలు రాశారు.  

అక్టోబర్ 19 నుండి తెలంగాణ విద్యార్థుల సైకిల్ యాత్ర

ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి వచ్చేనెల 19 నుండి యాత్ర ప్రారంభమౌతున్నాట్లు తెలంగాణ జాయింట్ యాక్షన్ ప్రతినిధులు ప్రకటించారు..వచ్చే పార్లమెంట్ సమవేశాలలొనే ప్రత్యేక తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టలనే డిమాండ్ తో పాటు ప్రజలను చైతన్య పరిచేందుకు ఈ యాత్ర జరుగుతుంది.12 రోజులపాటి జరిగే ఈ యాత్రలో పన్నెండు బృందాలు పది జిల్లలలో పర్యటిస్తాయి.