Sunday, October 24, 2010

తెలంగాణా ప్రజాప్రతినిధుల దిష్టిబోమ్మను దగ్ధం చేసిన ఓయూ జాక్


తెలంగాణాకు ప్రత్యేక ఎపిపిఎస్ ను నిర్వహించడంలో  విఫలం ఐన ప్రజాప్రతినిధులు తెలంగాణను తెస్తారా? అంటూ ప్రజాప్రతినిధుల వైఖరికి నిరసనగా ఆర్ట్స్ కాలేజ్ ముందు రోడ్దుపై రాస్తారోకో నిర్వహించి అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేసారు. ఈ కార్యక్రమంలో బండారి వీరబాబు,నెమ్మాది రవి,గెళ్లు శ్రీనివాస్,మర్రీ అనిల్,శ్రీహరి,లోకేష్ యాదవ్,శ్రీధర్ తదితరులు పాల్గోన్నారు.      

ఓయూలో గిరిజన విద్యార్థి సంఘం అద్వర్యంలో కొమురం భీం వర్ధంతి సభ

కొనసాగుతున్న రీలే నిరహార దీక్షలు

డిటెన్షన్ విదానాన్ని రద్దు చేయాలని ధర్నా

ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రస్తుత విద్యాసంవత్సరానికి డిటెన్షన్ విదానాన్ని రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ విద్యార్థి విభాగం ఆధ్వర్యంల్లో ఉస్మానియా యూనివర్శిటి పరిపాలన భవనం ముందు అంధోళన నిర్వహించారు.తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థులు చురుకుగా పాల్గొనడం వలన విద్యార్థులు పరీక్షలు సరిగ్గ రాయలేకపొయారని అందువలన డితెన్షన్ విదానాన్ని రద్దు చేసి వారిని రెండవ సెమిస్టర్ కి ప్రమోట్ చేసి మళ్ళి రాసేందుకు అవకాశం కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి విభాగం యూనివర్శిటి అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నారు.